TDP Updates

TDP Updates

Share

08/11/2025

కల్యాణదుర్గం నియోజకవర్గం గోళ్ల గ్రామంలో మంత్రి నారా లోకేష్‌కు గజమాలతో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు...

03/11/2025

లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు.

పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు.

అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు సీఎం వివరించారు.

02/11/2025

నవీ ముంబైలో జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా వీక్షించారు...ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ను కలిశారు.. సచిన్‌తో సెల్ఫీలు దిగారు.

Photos from TDP Updates's post 01/11/2025

కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ గారు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ గారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును స్థానిక అధికారులు, పోలీసులు మరియు ఆలయ నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

31/10/2025

(AP 09 G 393) టీడీపీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు....

Photos from TDP Updates's post 30/10/2025

తన సోదరుడు కీ.శే నారా రామ్మూర్తి నాయుడు గారి కుమారుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు నారా రోహిత్, శిరీషలను సీఎం చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ఆశీర్వదించారు..

30/10/2025

🔶 నైపుణ్యాభివృద్ధిపై సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష..

🔶 హాజరైన మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేష్ గారు, ఆ శాఖ ఉన్నతాధికారులు..

🔶 నైపుణ్యం పోర్టల్, జాబ్ డ్యాష్ బోర్డ్, వివిధ కోర్సుల గురించి సమీక్షలో చర్చ..

29/10/2025

మొంథా తుఫాను అనంతరం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ కేంద్రంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.

తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు...తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

29/10/2025

పునరావాస కేంద్రాల్లో ఉన్న పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా ఉదయానికే పాలు, టిఫిన్లు సరఫరా చేస్తున్న ప్రభుత్వం...

28/10/2025

మొంథా తుఫాను తీవ్రతపై ఆర్టీజీఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ గారు..

అర్థరాత్రి 12 గంటలకు ఆర్జీజీఎస్ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష..

సమీక్షలో పాల్గొన్న హోం మంత్రి అనిత, పురపాలక శాఖ పి.నారాయణ, ఇతర ఉన్నతాధికారులు

పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఈ రాత్రికి ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్న మంత్రి లోకేష్

తుఫాన్ తీరం దాటే సమయంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించిన అధికారులు

క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించి తుఫాను తీవ్రత, సహాయక చర్యలపై వాకబు చేసిన మంత్రి

పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టాలని మంత్రి ఆదేశం

Want your organization to be the top-listed Government Service in Visakhapatnam?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Visakhapatnam