Maadhava Reddy
29/03/2026
ఈరోజు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన శివశక్తి (ఆధ్యాత్మిక చైతన్య వేదిక) సమన్వయకర్త శ్రీ జి.సాయికుమార్ గౌడ్ గారు.
ధర్మ రక్షణకై ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన శివశక్తి ఫౌండేషన్ లో ముఖ్యులు శ్రీ జి. సాయికుమార్ గౌడ్ గారు. సనాతన ధర్మ రక్షణ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయన జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా.మాధవరెడ్డి గారు పాల్గొని, నూతనంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు.
శ్రీరాముడు పాటించిన ధర్మం, అందించిన సుపరిపాలన మనకు ఆదర్శం. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు ఓర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం. మీకు, మీ కుటుంబ సభ్యులకు
*శ్రీ రామనవమి శుభాకాంక్షలు*
మంత్రుల సోకులు - ప్రజల తిప్పలు
రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,తుమ్మల నాగేశ్వర్ రావులు హెలికాప్టర్ లో తిరగాలనే సోకుతో ప్రతీ చిన్న కార్యక్రమానికి హెలికాప్టర్ వాడుతూ ప్రజా సొమ్ము దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలను ఇబ్బందుల గురిచేస్తున్నారు.
నిజామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రుల హెలికాప్టర్ గాలికి స్వాగత తోరణం కూలిపోయి పలువురికి గాయాలు అవడమే కాకుండా ప్రాంగణం అంతా దుమ్ములేవడoతో అధికారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Hyderabad
500050